పిట్ట కథ
కులం , మతం,డబ్బు ,గబ్బు, జబ్బు బల్లమీద కూర్చుని , దమ్ము లాగుతున్నాయి ప్రేమ , మైత్రి , దయ, కరుణ చెత్త కుప్ప పక్కన గుడిసెలొ కూర్చుని మాట్లాడుకుంటున్నాయి ప్రేమ : ఏంటి బ్రదర్ మనం స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకున్నా ఛీ తూ అంటారు , వాలేమో పాచి నోటితొ అత్తరువేసుకున్నా నవాబు బాబ్బాబు అంటారు మైత్రి : అవును అన్న నాకు కూడా బోధపడలేదు . కాని ఒక సారి అలా వెళ్ళినపుడు విన్నా అన్న వాళ్లకి మన లాగ రక్తం లేదంట , ఏదో కొత్త పేరు చెప్పారన్న , (ఏంటబ్బా అని తలగోక్కుంటోంది ) నాలుక మీద ఉంది నోటి బైటికి రావట్లేదు అన్న పక్కనుండి దయగాడు మొట్టికాయ వేసాడు మైత్రి : ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది "రోగం " రోగం ఉంది అంట వాళ్లకి దయ : రోగంమా అంటె ఏంట్రా? మైత్రి : ఏమో అన్న నాకేం తెలుసు మొన్న సంతకి (సమాజంలోకి ) వెళ్ళినపుడు విన్న వాళ్లకి రోగం ఉందంట అది పడితే పోదంట అని , దయ : ఆబ్బ్బా అంత గట్టిదా అది ,మనకెందుకు లేదు తమ్ముడు అది ప్రేమ : చాల్లెరా నీ ఆశ ,అవి రావడానికి మనకేం దమ్మిడీ...